ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్;

కాళేశ్వరం లో సరస్వతి పుష్కరాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం అయ్యాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

సరస్వతి పుష్కరాలు విజయవంతంపై బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు 30.లక్షల మందికి పైగా భక్తులు వచ్చారని తెలిపారు. పుష్కరాలు ఏర్పాట్లు పై నిరంతరం ప్రభుత్వ మార్గదర్శనం.

మేరకు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేసిన ప్రకారం జిల్లా యంత్రాంగం సర్వం సన్నదం చేసినట్లు తెలిపారు. సరస్వతి ఘాట్ వద్ద సరస్వతి మాతా విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు. హారతి ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసి ప్రతి రోజు కాశీ పూజారులచే సరస్వతి నవరత్న మాలా హారతి నిర్వహించామని తెలిపారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా బారికేడింగ్ ఏర్పాటు చేసి ప్రతి 50 మీటర్లకు ఒక గజ ఈతగాళ్ళును పెట్టినట్లు తెలిపారు. సింగరేణి రెస్క్యూ టీము, ఎస్డీఆర్ 

ఎఫ్, ఎన్దిఆర్ఎఫ్ టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణకు సెక్టార్లు, జోన్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షణకు అధికారులను నియమించినట్లు తెలిపారు. టెంట్ సిటీ ఏర్పాటు ద్వారా 40 రూములు, 200 డార్మెటరీ, ఫుడ్ కోర్టు, కిడ్స్ ప్లే జోన్, వాహన పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు ద్వారా భక్తులను ఘాట్ వరకు, ఘాట్ నుండి బస్ స్టాండ్, దేవాలయం సమీపం వరకు ఉచిత సేవలు అందించినట్లు తెలిపారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించామని తెలిపారు. వర్షం వల్ల అవాంతరాలు వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేశామని తెలిపారు. చలి వేంద్రాలు ఏర్పాటు ద్వారా మంచినీరు సరఫరా చేసినట్లు తెలిపారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు మజ్జిగ, మంచినీరు సరఫరా చేయడంతో పాటు క్యూ లో ఉన్న భక్తుల సౌకర్యార్థం కూలర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎప్పటి కపుడు భక్తులతో ముకాముఖీ అవుతూ చెప్పిన సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు.

సమాచార కేంద్రాలు ఏర్పాటు ద్వారా తప్పి పోయిన భక్తుల, ఇతర సమాచారం అందించినట్లు తెలిపారు. వ్యర్థాలు నిర్వహణకు కాళేశ్వరంలో ఇన్సినరేటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణ చాలా సంతృప్తిని ఇచ్చినట్లు తెలిపారు. ఈ అనుభవం రాబోవు గోదావరి పుష్కరాలు నిర్వహణకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ 3 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం చిన్న గ్రామమని లక్షల్లో భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేశామని తెలిపారు. 90 షటిల్ బస్సులు ఏర్పాటు ద్వారా భక్తులను బస్ స్టాండ్ నుండి ఘాట్ వరకు ఉచితంగా రవాణా చేసినట్లు తెలిపారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమని, చాలా ప్రామాణికంగా తీసుకుని బందోబస్తు నిర్వహించామన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ రాష్ట్ర పోలీసుల సమన్వయంతో పటిష్ట పోలీస్ పహారా నిర్వహించామని అన్నారు. పార్కింగ్ స్థలాలు, హోల్డింగ్ పాయింట్లు సరిపడ ఏర్పాటు చేసినప్పటికీ, అటవీ ప్రాంతం కావడం, మధ్యలో భారీ వర్షం రావడం జరిగిందని, తద్వారా ట్రాఫిక్ కు ఇబ్బందులు ఎదురైనా, అధిగమించామని అన్నారు. అటవీ ప్రాంతం కావడం వల్ల పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేయుటకు ఇబ్బందులు వచ్చాయని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షం వల్ల ఇబ్బందులు వచ్చినా 24 గంటలు పనిచేశామని తెలిపారు. సరస్వతీ పుష్కరాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం అయినందుకు ధన్యవాదాలు తెలిపారు.

లక్షలాదిమంది భక్తులు పుష్కరాలకు వచ్చిన ఎలాంటి తొక్కిసలాట లేకుండా, శాంతిభద్రతలపరంగా పటిష్ట భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేశామని, 200 సీసీ కెమెరాలతో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేశామని, పుష్కరాల్లో దొంగతనాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, మహిళా భక్తుల రక్షణ కోసం మఫ్టీలో మహిళా పోలీసులను, షీ టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తన 8 సంవత్సరాలు సర్వీస్ లో ఇదొక మంచి అనుభవంగా ఉపయోగపడుతుందని తెలిపారు. వివిఐపిలు, వీఐపీలు వచ్చారని అయినా పటిష్ట బందోబస్తు నిర్వహించామని అన్నారు. సరస్వతి పుష్కరాలకు మీడియా విస్తృత ప్రచారం కల్పించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, 

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎఎస్పీ బోనాల కిషన్, డిపిఆర్ఓ శ్రీనివాస్, కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి తదితరులు. పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: