పెద్దపల్లి,అక్టోబర్17(మే డిగడ్డటీవీన్యూస్ ఛానల్ బూర్ఆఫ్ తెలంగాణ)మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని,జ్యోతి ప్రజ్వలన చేసి,మహాకవి వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడరు.మహాకవి వాల్మీకి హైందవ ధర్మానికి అతిముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని రచించారని,రామాయ ణ గ్రంథంద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని కలెక్టర్ పేర్కొన్నారు.రామాయణంద్వారా ఆదర్శ మానవుడికి ఉండవలసిన లక్షణాలు,మానవ సంబంధాలు,విలువలను మహాకవి అందరికీ బోధించారని.మహాకవి వాల్మీకి రచించిన రామాయణం కారణంగానే మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని.నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వసుదైక కుటుంబం అనే భావన రామాయణంతో ముడీబడి ఉందని.మహాకావ్యం రామాయణాన్ని రచించిన మహాకవి వాల్మీకి జయంతిని పండగగా జరుపుకోవడం సంతోషకరమని కలెక్టర్ తెలిపారు.అనంతరం వక్తలు మహర్షీ వాల్మీకి జీవిత విశేషాలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్,కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు ప్రకాష్ సునీత,పద్మావతి,కలెక్టరేట్ సిబ్బంది,బీసీ సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: