ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు సమస్యలపై వినతి పత్రాలను అందజేయగా హనుమకొండ జిల్లా ఆదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు స్వీకరించారు.

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందజేసిన ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. 

వివిధ సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమంలో 158 దరఖాస్తులను అందజేశారు. 

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వై.వి.గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె.నారాయణ, సిపిఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: