ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

సమస్యల పరిష్కారం కోసం  ప్రజావాణిలో ప్రజలు అందించిన ఫిర్యాదులను పరిష్కరించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య జిల్లా అధికారులను ఆదేశించారు.

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వినతులను పరిశీలించిన కలెక్టర్ ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుండి 165 ఫిర్యాదులు వచ్చాయి.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, పరకాల, హనుమకొండ ఆర్డీవోలు డాక్టర్ కె.నారాయణ, వెంకటేష్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: