పెద్దపల్లి,డిసెంబర్,12,మేడిగడ్డటీవీన్యూస్,యశోద ఆసుపత్రి నుంచి కేసిఆర్ వీడియో సందేశం,నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు,కోలుకోనిత్వరలోనే మీ మధ్యకు వస్తా,ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు బయటకు పంపటం లేదు,దయచేసి యశోద దవాఖానకు రాకండి అంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు దండంపెట్టి చెప్పాడు...యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విజ్ఞప్తి చేసారు.తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ మధ్యలకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దు,తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకుంటున్న తనపట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరంతో చేతులు జోడించి మొక్కుతున్న,తనను చూడడానికి వచ్చి మీరూ ఇబ్బంది పడొద్దు,హాస్పటల్ లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దు.ఎవరు కూడా నన్ను చూడడానికి రావద్దని వైద్యుల సూచనలు పాటించాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు...
Post A Comment: