పెద్దపల్లి:మంథని:నవంబర్:3:(మేడిగడ్డటీవీన్యూస్,ఛానల్):బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.మంథని నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల్లోని కాంగ్రెస్‌ బీజేపీ శ్రేణులుఆ పార్టీలను వీడి బీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారు.ఇటీవలి కాలంలో మంథని,ముత్తారం,మల్హర్‌,కాటారం,మహదేవ పూర్,మహముత్తారం మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.తాజాగా మంథని పట్టణంలో  రాజాగృహాలో మహదేవ పూర్ మండలం కాళేశ్వరం గ్రామానికీ చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,యువకులు,మహిళలు 

భిఆర్ఎస్ లో చేరారు.మంథని భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ప్రభుత్వం,సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృధ్ది,సంక్షేమ పథకాల అమలుతో పాటు నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ చేస్తున్న సేవలకు ఆకర్షితులై ఆయనకు అండగా నిలువాలని బీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రకటించారు.నియోజకవర్గ అభివృధ్ది,ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్న జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌కు అండగా నిలిచి ఆయన గెలుపుకోసం తమవంతు సహకారం అందిస్తామని ఈసందర్బంగా వారు స్పష్టం చేశారు.రాబోయే ఎన్నికల్లో మంథని గడ్డపై గులాభీజెండా ఎగురడం,పుట్ట మధుకర్ గెలుపు ఖాయమని వారు తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: