ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా  నేటి నుంచి ఈనెల 30 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని శుక్రవారం  జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే   పేర్కొన్నారు. పోలీసు యాక్ట్ ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పి  తెలిపినారు.  శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి సూచించారు. కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణ కు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు  ప్రజలు సహకారం అందించాలని కోరారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: