ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేగొండ మండలం చెన్నాపూర్ క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి   పుల్లా కరుణాకర్  మంగళ వారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో  కట్టుదిట్టంగా అమలు చేస్తామని, నగదు, మద్యంపై ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, రూ. 50  వేల కంటే ఎక్కువ నగదు ప్రజలు తీసుకెళ్ల వద్దని అన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి ఉన్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతుందని, ఎవరూ  ఓటర్లను ప్రలోభపెట్టే   ఏలాంటి చర్యల కు దిగవద్దని,  పట్టుబడితే  సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. చెక్ పోస్ట్ సిబ్బంది వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని, అప్రమత్తoగా వ్యవహరించాలని,  ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పి కరుణాకర్  సూచించారు. ఈ కార్యక్రమంలో  చిట్యాల సీఐ వేణు చందర్,  రేగొండ ఎస్సై  శ్రీకాంత్ రెడ్డి, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: