ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;పరువు నష్టం దావా కేసులో భాగంగా శుక్రవారం అదాలత్ లోని హన్మకొండ జిల్లా కోర్టుకు హాజరై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
వాంగ్మూలం ఇచ్చారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ
హనుమకొండ నయింనగర్ లోని పెద్ద నాలా పై చైతన్య డిగ్రీ కళాశాల యాజమాన్యం అక్రమ నిర్మాణం చేసినది.
2016 సెప్టెంబర్ లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా అక్రమంగా కట్టిన ఈ నిర్మాణాల వలన ప్రవహించే నీరు అంతా నయీమ్ నగర్ లో లోతట్టు ప్రాంతాలలోనీ ఇళ్లలో చేరాయి. కళాశాల నాలాల పైన అక్రమ నిర్మాణాలు కట్టడం వల్ల పక్కనే ఉన్నటువంటి ఇండ్లలోకి మురుగునీరు చేరి వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి నీరు నాలాల గుండా ప్రవహించే విధంగా చూడాలని అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు ఆదేశాలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా అధికారులు అందరితో కలిసి నాలాల పర్యవేక్షణకు వెళ్లడం జరిగింది. ఆ సమయంలో చైతన్య డిగ్రీ కాలేజ్ యజమాని పురుషోత్తం రెడ్డి ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఆరోపణలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మరియు నాపై దుర్బషలాడారని అన్నారు.
న్యాయస్థానంపై పూర్తి నమ్మకంతో ఈ తప్పుడు ఆరోపణలపై పురుషోత్తం రెడ్డి పై ఆ రోజున పరువు నష్టం దావా వేయడం జరిగింది.
శుక్రవారం హన్మకొండ జిల్లా కోర్టులో జడ్జ్ కి సాక్షాధారాలు అందించడం జరిగింది. ఈనెల 20వ తారీఖున మళ్లీ కోర్టుకి హాజరుకావాలని జడ్జ్ సూచించడం జరిగింది. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారే ఇలా నాలాంటి ప్రజా ప్రజాప్రతినిధుల పై తప్పుడు ఆరోపణలు చేయడం చాలా బాధాకరమని అన్నారు. ప్రజల కోసం పోరాడేటువంటి నన్ను ఇలా అనడం భావ్యం కాదని అన్నారు.
Post A Comment: