మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
ములుగు: జిల్లా పోలీస్ అర్మడ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వహిస్తూ అనుకోని విధంగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ శ్రీ గౌష్ ఆలం నేటి శుక్రవారం రోజు తన స్వస్థలం అయిన గ్రామం& మండలం వెంకటాపూర్ లోని తన స్వగృహం వద్ద ప్రసాద్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరమని విచారాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని, ములుగు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ తమ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని, ప్రభుత్వం ద్వారా సంక్రమించాల్సిన అన్ని లాభాలను మంజూరు అయ్యేలా చూస్తానని, ఉద్యోగ అర్హత కలిగిన కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం లభించేలా కృషి చేస్తానని జిల్లా ఎస్పీగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఓఎస్డి ములుగు, భూపాలపల్లి అశోక్ కుమార్ ఐపిఎస్, అదనపు ఎస్పీ సదానందం, ఆర్ఐ అడ్మిన్ వెంకటనారాయణ, ఆర్ఐ హోంగార్డ్ స్వామి, వెంకటాపూర్ ఎస్సై తాజోద్దీన్ ఇతర పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: