మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మంథని: పట్టణంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జన్మదిన సందర్భంగా, ఈరోజు మంథని లో ఆయన విగ్రహనికి బీజేపీ రాష్ట్ర నాయకులు, మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ చంద్రుపట్ల సునీలన్న పూలమాల వేసి అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి మహోత్సవంలో పాల్గొని, ఈ సందర్భంగా సునిలన్న మాట్లాడుతూ...
మన దేశం నేడు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి పునాదులు వేసింది అంబేద్కర్,
అజ్ఞానాంధకారాలను చీల్చి, జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన మేధావి అంబేద్కర్, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి, భారతదేశ పేరు ప్రఖ్యాతలను విశ్వవ్యాప్తం చేశారు.కుల, మత, వర్ణ లింగ ప్రాంత భేదాలు లేని దేశంగా భారతదేశాన్ని నిర్మించాడు.నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అనే గొప్ప సిద్ధాంతాన్ని చెప్పాడని, బడుగు బలహీన అభ్యున్నతికి పాటుపడి అంటారానేతనం రూపుమాపాడు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, వారి సిద్ధాంతాలను అనుసరిస్తున్న ఏకైక పార్టీ బిజెపి పార్టేనని అన్నారు.ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్, అసెంబ్లీ కో-కన్వీనర్ నాంపల్లి రమేష్, బిఎస్ఏ నియోజకవర్గ ఇన్చార్జ్ చిలువరి సతీష్, మండల ఇన్చార్జులు విరబోయిన రాజేందర్, తోట మధుకర్, మండల ఉపాధ్యక్షులు బూడిద రాజు, రేపాక శంకర్ సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, రాపర్తి సంతోష్, వేల్పుల సత్యం,కోరబోయిన మల్లికార్జున్, చేరుకుతోట సుధాకర్, కాసర్ల సూర్య, ఎడ్ల సాగర్, బొల్లంపల్లి లక్ష్మణ్, కుమారస్వామి,ఎల్క సదానందం, బోసెల్లి శంకర్, దొడ్డిపట్ల శంకర్, కాయితి ప్రభాకర్, బుర్ర రాజు పార్వతి విష్ణు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: