మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని కూరగాయల మార్కెట్లో ఏఐటీయూసీ అనుబంధ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ ఎం.ఏ.గౌస్, ఏఐటీయూసీ నాయకులు శనగల శ్రీనివాస్, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు గడ్డం రామచందర్, కండే లక్ష్మయ్య లు అంబెడ్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ మట్టిలో మాణిక్యమని, ఆయన భారత దేశానికి, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు వెల కట్టలేనివని వారు పేర్కొన్నారు. ఎప్పుడైతే మనం రోడ్డెక్కి హక్కుల కోసం పోరాటం చేస్తామో అక్కడ ఆ దేశ రాజ్యాంగం అమలుకు నోచుకోలేదని ఆక్కడ అధికారులు వారి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, పనికి మాలిన పాలకులు పాలిస్తున్నారని వారన్నారు. భారత రాజ్యాంగం ఒక్క దళితులకు మాత్రమే రచించినది కాదని, భారత గడ్డ పై జన్మించే ప్రతి పౌరుడు నీ దృష్టి లో పెట్టుకొని అందరి క్షేమం కొరకు రచించ బడిందని, అంటరానితనం, కుల నిర్మూలనా కోసం తన జీవితం మొత్తం త్యాగం చేశారనేది గుర్తుంచు కోవాలని వారన్నారు.నేడు ఆయన పేరు చెప్పుకొని ఆయన పెట్టిన రాజ్యాంగ బిక్షతో ఎమ్మెల్యేలు, మంత్రులుగా చలామణి అవుతూ అగ్రకులాల్లోని అవినీతి తిమింగలాల చేతిలో రబ్బరు స్టాంప్లులు గా మిగిలి పోయారని, వ్యక్తిగత ఆపేక్ష లకు లొంగిపోయి సమిష్టి, సంఘ ప్రయోజనాలను తాకట్టుపెడుతూ అనేక అరాచకాలు, నేరాలకు కేంద్ర బిందువులుగా చీడ పురుగుల వలే సిగ్గు లేకుండా సమాజంలో జీవిస్తున్నారని వారు పేర్కొన్నారు. అంబేద్కర్ కలలు కన్న అసలైన ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతున్నారని, ఆయన ఆత్మ నీ క్షోభ పెడుతున్నారని, మారండి ఇప్పటికైనా లేదంటే మరో స్వతంత్ర పోరాటానికి సిద్దం కావలసి వస్తుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమం లో హమాలీ కార్మికులు ఎండి జానీ మియా, గాలిపెల్లి సతీష్ బండారి రవీందర్, టి రవి, గొర్రె రాజయ్య, కొమ్ము అనిల్, కల్వచర్ల రమేష్, రాములు, రాజు, మాదాసి సమ్మయ్య,గొర్రె శ్రీనివాస్, సకినాల కుమార్, సదయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: