పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న

   


                                                      పెద్దపల్లి:గోదావరిఖని:ఏప్రిల్:12:అనుమతి లేకుండా విగ్రహ ప్రతిష్ట కు పూనుకున్న కాంగ్రెస్ నాయకులను ముస్త్యాల  గ్రామస్తులు అడ్డుకున్నారు.ఆ గ్రామ చివర గల ఎర్ర చెరువు మత్తడి,కొత్త రోడ్డు మూలమలుపు వద్ద మహనీయుల విగ్రహాలు పెట్టాలని గతంలో ముస్త్యాల గ్రామస్తులు టిఆర్ఎస్ నాయకులకు,సింగరేణి జీఎంకు వినతి పత్రం ఇచ్చియుంటిరి.కాని దానికి అనుమతి ఇవ్వకుండా పెండింగ్ లో ఉన్న సమయంలో ముస్త్యాల గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ వారు ఏప్రిల్ 11,సోమవారం మహనీయుల విగ్రహాలకు బదులు, ఒక రాజకీయ నాయకుని విగ్రహాన్ని పెట్టడం సరి అయింది కాదని గ్రామ ప్రజలు టిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామపంచాయితీ నుండి ప్రభుత్వ భూమిగా అనుమతి ఉన్నట్టు వారు చెబుతున్న మాట.సింగరేణి వారి నుండి ఎలాంటి అనుమతి లేకుండా శ్రీపాదరావు విగ్రహాన్ని పెట్టడానికి గద్దె నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిన గ్రామస్తులు,బుధవారం టిఆర్ఎస్ నాయకులు అడ్డుకొని నిలుపుదల చేసినారు.ఆక్కడ మహనీయుల విగ్రహాలు లేదా అమరవీరుల విగ్రహాలను ప్రతిష్టించడం మంచిదని,ఎలాంటి రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టరాదని గ్రామస్తులు కాంగ్రెస్ వారికి హితువు పలికినారు.మహనీయుల చరిత్రను అవమానపరుస్తున్న కాంగ్రెస్ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వర్గీయులు ముస్త్యాల కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై కళాధర్ రెడ్డి,పోలీసు వారు వచ్చి విచారణ చేపట్టి,ఆ కాంగ్రెస్ నాయకుని విగ్రహ ప్రతిష్టకు ఎలాంటి (సింగరేణి,ప్రభుత్వ) అనుమతులు లేవని తేలడంతో నిలుపుదల చేయాలని ఆదేశించినారు.మహనీయులను విస్మరిస్తున్న కాంగ్రెస్ నాయకులకు భవిష్యత్ లో తగిన గుణపాఠం చెబుతామని ముస్త్యాల గ్రామస్తులు తెలియజేశారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: