ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఓటరు జాబితా నుంచి తోలగించిన ఓటర్ల వివరాలను మరో సారి సరిచూసి, పరిశీలించి ధృవీకరించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
బుధవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవి కిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో ఓటర్ జాబితా, పి.ఎస్.ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఫోటో సిమిలర్ ఎంట్రీ పరిశీలన చేసి డబుల్ ఎంట్రీ, డుప్లికేట్ లను తోలగించామని , ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తొలగించిన ఓట్ల వివరాలు అధికంగా ఉన్నందున మరోసారి పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి ఓట్లు, మరణించిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లు జాబితా నుంచి తొలగించామని, తొలగించిన ఓట్లకు సంబంధించి సంపూర్ణ సమాచారం మన వద్ద అందుబాటులో ఉండాలని, తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయో లేవో ధ్రువీకరించాలని ఆయన పేర్కొన్నారు.
ఓటరు జాబితా రూపకల్పనలో బూత్ స్థాయి అధికారులు కీలకపాత్ర పోషిస్తారని, ప్రైవేట్ వ్యక్తులను బూత్ స్థాయి అధికారులు గా నియమించవద్దని, ఎక్కడైనా అలా ఉంటే 7 రోజులలో తొలగించి ప్రభుత్వ సిబ్బంది నియమించాలని ఆయన సూచించారు. ఓటర్ జాబితాబ్ కు సంబంధించిన సమాచార హక్కు చట్టం దరఖాస్తులను సకాలంలో సమాధానం అందించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోన్ని ఓటర్ ఐడి కార్డులలో పుట్టిన రోజు తేదీలు ఒకే విదంగా ఉన్నాయని వాటి వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సవరించాలని ఆయన పేర్కొన్నారు.
వీడియో సమావేశం అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఓటర్ల జాబితా పై పలు సూచనలు చేసి మాట్లాడుతూ,జిల్లాలో ఉన్న ఫోటో సిమిలర్ ఎంట్రీలను ఆర్డీవోలు, తహసిల్దార్ లు ప్రత్యేకంగా పరిశీలించాలని, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలని తెలిపారు. ఓటరు జాబితా నుంచి తొలగించిన పేర్ల వివరాలు మరోసారి పరిశీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేర డాక్యుమెంట్లు సంతకాలు ఉన్నాయో లేవో తనిఖీ చేయాలని కలెక్టర్ రెవిన్యూ డివిజన్ అధికారులను, తహసిల్దారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, డిఆర్ఓ వాసుచంద్ర, పరకాల ఆర్డీఓ రాము, హనుమకొండ తహశీల్దార్ రాజకుమార్, ఎలక్షన్ సెక్షన్ సుపెరిండెంట్ జ్యోతి వరలక్ష్మి,సమ్మక్క, అవినాష్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: