మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
దివంగత నేత అజాతశత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పనిచేసే ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దుదిల్ల శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో రామగుండం పట్టణంలోని తబిత ఆశ్రమంలోని విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు*ఈ సందర్భంగా దుద్దిల్ల శ్రీపాద రావు ఘన నివాళి అర్పించిన అనంతరం కార్యక్రమ నిర్వాహకులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ సర్పంచ్ స్థాయి నుండి మూడుసార్లు ఓటమి ఎరుగని శాసన సభ్యునిగా అజాతశత్రువుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా మంథని ప్రజల్లో గుండెల్లో గూడుగట్టుకొని ఒక మంతినే కాకుండా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మహానేతగా పేరుగాంచిన దుదిల్ల శ్రీపాద రావు ఆశయ సాధన కోసం కంకణ బద్ధులై దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న నేపథ్యంలో వారి నాయకత్వాన్ని బలపరుస్తూ పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నప్పుడే వారికి ఘన నివాళులర్పించినట్టు అవుతుందని అన్నారు*అనంతరం ఉమ్మడి రామగుండం మండల మాజీ ఎంపీపీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజలింగం మాట్లాడుతూ శ్రీపాద రావు చేసిన సేవలు రాబోయే తరాలకు అందించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వారికి నివాళి అర్పించడం మనందరి బాధ్యత అని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకువచ్చినప్పుడే శ్రీపాద రావు కు నివాళి అర్పించిన అవుతుందని అందుకోసం మనందరం కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు
*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీ ఉరిమెట్ల రాజలింగంలతోపాటు కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ మరీదు మురళీకృష్ణ గౌడ్ అంతర్గాం జడ్.పి.హెచ్.ఎస్ కమిటీ చైర్మన్ బాణాల బుజ్జి బాబు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజల్ శంకర్ కడమండ దివాకర్ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ అంతర్గా మండల అధ్యక్షులు బరుపటి శ్రీనివాస్ , మేడి ఓదెలు, ఫస్ట్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ ఫ్రేమ్, సీనియర్ నాయకులు శేఖర్, బైర్ కిరణ్ గౌడ్,పెద్దంపేట గ్రామ అధ్యక్షుడు మీరు కుమార్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు ఊరేటి మహేష్, ఉప్పల వెంకటేష్, బీరెల్లి ప్రశాంత్, కొమ్ము రమేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: