మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పెద్దపల్లి జిల్లా అంతర్గాం  మండలం మురుమూరు గ్రామంలో ఉరిమెట్ల  రాజలింగం గారి స్వగృహంలో అత్యవసరంగా సమావేశమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర కార్యక్రమంతో దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసి మోడీ అరాచకా పాలనను గొంతు ఎత్తి ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ  పార్లమెంటు సభ్యత్వా రద్దు అనే దుశ్చర్య  ఖండిస్తూ సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క  ఏర్పాటు చేసిన సత్యాగ్రహ సభకు రేపు మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో మన నాయకులు మాజీ మంత్రి మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్  బాబు  నేతృత్వం లో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్  రాజ్ ఠాకూర్  నాయకత్వంలో వేలాదిగా తరలి వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు*అనంతరం మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం   మాట్లాడుతూ  రేపు జరగబోయే సత్యాగ్రహ  సభకు దళిత సింహం భారత పార్లమెంట్ సభ్యులు అఖిలభారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే  హాజరవుతున్న బడుగు బలహీన వర్గాలను ప్రజలందరిని చైతన్యపరిచి ప్రతి ఒక్క కార్యకర్త వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీ ఉరిమెట్ల రాజలింగంలతోపాటు కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ మరీదు మురళీకృష్ణ గౌడ్ అంతర్గాం జడ్.పి.హెచ్.ఎస్ కమిటీ చైర్మన్ బాణాల బుజ్జి బాబు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజల్ శంకర్ కడమండ దివాకర్ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ అంతర్గా మండల అధ్యక్షులు బరుపటి శ్రీనివాస్  , మేడి ఓదెలు, ఫస్ట్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ ఫ్రేమ్,  సీనియర్ నాయకులు శేఖర్, బైర్ కిరణ్ గౌడ్,పెద్దంపేట గ్రామ అధ్యక్షుడు మీరు కుమార్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు ఊరేటి   మహేష్, ఉప్పల వెంకటేష్, బీరెల్లి ప్రశాంత్, కొమ్ము రమేష్ తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: