పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:ఏప్రిల్:14:ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం,ముస్త్యాల గ్రామంలో శుక్రవారం టీఆర్ఎస్(బీఆర్ఎస్)పార్టీ,వివిధ సంఘాల నాయకులు,జర్నలిస్టులు పాల్గొని ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడరు,రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత అన్ని వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కొనియాడారు,ఈ కార్యక్రమంలో ముస్త్యాల టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాసినేని సత్యనారాయణరావు, సీనియర్ జర్నలిస్టు పుట్ట రాజన్న,సుంకరి మహేష్,మొదటి వార్డ్ మెంబర్ బాసినేని వినోద రావు,సుంకరి పోతరాజు,సిద్ధ శేఖర్,కన్నం స్వామి,కాజీపేట నాగరాజు ఎక్స్ ఎంపీటీసీ,బొడ్డుపల్లి సురేష్,జనగామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: