మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
భూపాలపల్లి: జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, 7200 తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా 7200 తీన్మార్ మల్లన్న టీం ప్రజల సంక్షేమం కోసం విద్య, వైద్యం, సత్వర న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కృషి చేస్తుందని, రాజ్యాంగ రచయిత అంబేద్కర్ చెప్పిన ఓటు విలువ గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజలని చైతన్య వంతులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.ఇందులో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, అంబాల నరసయ్య, సామల చంద్రన్న పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
Post A Comment: