మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎక్లాస్ పూర్ , పొట్యాల గ్రామాల్లో సర్వే నిర్వహించి గ్రూప్ మీటింగ్ పెట్టడం జరిగింది ,రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పోరుయాత్ర సభ జరిగిందిఈ సందర్భంగా పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కోడిపుంజు లక్ష్మి ప్రజాపంద జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న మాట్లాడుతూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాల గడుస్తున్నా పేదల బ్రతుకులు మారడం లేదు మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరిచిపోయింది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ అనుకుంటే అందరి జీవితాలు రోడ్ల పైన పడ్డాయి,
పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా కేవలం దొడ్డిబియ్యం మాత్రమే ఇస్తున్నారు దానివలన ఎలాంటి ఉపయోగం లేదు పైగా నిత్యవసర వస్తువుల సరుకులు ధరలు ఆకాశానికి అంటుతున్నాయి,
పేద ప్రజలు కుటుంబం గడవలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు నిత్యవసర సరుకులు మొత్తం రేషన్ షాపుల ద్వారా ఉచితంగా ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం
వందరోజుల పని రోజులు పెంచాలని శ్రమకు తగిన ఫలితం వేతనాలు పెంచాలని ఎండాకాలం సమయంలో వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం
1). రేషన్ షాపుల ద్వారా ప్రజలకు 12 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలి.
2). రేషన్ షాపుల్లో 10 కేజీల సన్నబియ్యం ఇవ్వాలి.
3). దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి.
4). గ్యాస్ సిలిండర్లు సగం సబ్సిడీతో (రూ. 500/- లకి) ఇవ్వాలి.
5, ఉపాధి హామీ పథకం ద్వారా చేసినన్ని రోజులు పని ఇవ్వాలని వారి శ్రమకు తగ్గిన వేతనాలు ఇవ్వాలని ఎండాకాలం సమయంలో వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో ప్రజాపంథా డివిజన్ నాయకులు*తీగుట్ల రాములు మండల నాయకులు*T. దేవేందర్ మొండన్న కనకయ్య రాజయ్య లక్ష్మి టీగుట్ల దేవేందర్. తిరుమల విజయ సుజాత యశోద గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: