మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్/భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది.కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతువు జరిగింది. వేదమంత్రోచారణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసుకొచ్చారు. అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ చేశారు.
జగదభిరాముని కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కల్యాణ వేడుకకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ తాతా మధు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కల్యాణ ఘటం జరిగింది.
Post A Comment: