ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోతున్న వారిని సి.పి.ఆర్ నిర్వహించడం ద్వారా రక్షించవచ్చని, ఆ దిశగా ప్రతి ఒక్కరు సి.పి.ఆర్ పై అవగాహన కలిగి ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం ఇల్లందు క్లబ్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సిపిఆర్ ట్రైనింగ్ కార్డియో పల్మనరీ రిసోసియేషన్ శిక్షణ ప్రజా ప్రతినిధులకు, వైద్య సిబ్బందికి, అధికారులకు ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ అనంతరం చాలామంది గుండె నొప్పి కారణంగా మృతి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అందరికీ సిపిఆర్ ప్రక్రియ పై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఒక వ్యక్తికి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు అయినప్పుడు వారికి సి పి ఆర్ ,ఏ ఈ డి చేసినట్లయితే వారిని ప్రమాదం నుండి కాపాడగలుగుతామని అన్నారు. ఇది లేకపోవడం వలన మరణాలు సంభవిస్తున్నాయని, అందువలన సి.పి.ఆర్ ట్రైనింగ్ సడన్ కార్డియాక్ అరెస్టు అయినప్పుడు ప్రథమ చికిత్స అందించాలన్నారు. దీనికై ప్రతి ఉద్యోగికి ఈ శిక్షణ అవసరం ఉందని తద్వారా ప్రాణాలు కాపాడవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ప్రాణానికి మించి ఏది లేదని, మన చుట్టుప్రక్కల వారు ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలిపోతే వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారమిస్తూ, వాహనం వచ్చే వరకు సీపీఆర్ చేస్తూ, ఊపిరి అందిస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడ వచ్చని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులకు అధికారులకు శిక్షణ పొందిన ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, వారు తిరిగి ఇతరులకు శిక్షణ ఇస్తారని అన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రోగ్రాం ఆఫీసర్ డా. అన్వేషిని, డాక్టర్ ప్రమోద్ శిక్షణ ఇవ్వడం జరిగింది. సి పి ఆర్ కార్డియో పల్మనరీ రీసోసియేషన్ అనేది సడన్ కార్డియాక్ అరెస్టు, స్పందనలో కీలకమైనదని, గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, మెదడు మరియు ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడి వెంటనే సహాయం అందించకపోతే మెదడు దెబ్బతినడం లేదా మరణం నిమిషాల్లో సంభవిస్తుందని తెలిపారు.
సిపిఆర్ అనేది అత్యవసర వైద్య సేవలు వచ్చేవరకు ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని అందించడంలో సహాయపడే రక్షక సాంకేతికత లక్ష్యం చాతి నొక్కడం మరియు రెస్కు శ్వాసలను అందించడం ద్వారా శరీరమంతా ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని అందిస్తుందని ఇది మెదడు మరియు ఇతర అవయవాలకు ఆక్సిజన్ అందించడంలో సహాయపడుతుందని, నష్ట తీవ్రతను తగ్గిస్తుందని, బ్రతికే అవకాశాలను పెంచుతుందని తెలిపారు. జీవించి ఉన్న లక్షణాలు కనిపించని వ్యక్తులపై సిపిఆర్ చేయబడుతుంది. జీవించి ఉన్న లక్షణాలు కనిపించని బాధితుడిని సిపిఆర్ చేస్తే వారి జీవితాన్ని రక్షించగలం. జీవించి ఉన్న సంకేతాలు లేవని నిర్ధారించిన తర్వాత మీరు చాతి నొక్కడం ద్వారా గుండె నుండి శరీర భాగాలకు రక్తప్రసరణ అందించడం, హెడ్ టిల్ట్ చిన్ను లిఫ్ట్ నైపుణ్యం ద్వారా వాయు మార్గాన్ని తెరవడం శ్వాస కోసం తనిఖీ చేయడం, కృత్రిమ శ్వాసను కల్పించడం, సిపిఆర్ విషయంలో 30 సార్లు చాతినొక్కడం మరియు రెండు వెంటిలేషన్ తో చేయడం జరుగుతుందని శిక్షకులకు పవర్ ప్లాంటేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ. డా. శ్రీరామ్, మున్సిపల్ ఛైర్పెర్సన్ వెంకట రాణి సిద్దు, చిట్యాల , రేగొండ జెడ్పిటిసిలు సాగర్, విజయ, మల్హార్రావు , ఎంపీపీ మల్లార్ రావు ,జిల్లా అధికారులు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఎం.పి.డి.ఓ. భూపాలపల్లి ఇతర శాఖల సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: