ఉమ్మడివరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై బుధవారం విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీ లు, విద్యాశాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.
ఇంటర్ పరీక్షలను అధికారులు విజయవంతంగా నిర్వహించినందుకు మంత్రి అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 3 2023 నుంచి ఏప్రిల్ 13, 2023 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు.
10వ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లు కుదించామని, దీని పై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏఎన్ఎం అందుబాటులో ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. వేసవికాలంలో పరీక్షల నిర్వహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, ఉదయం, మధ్యాహ్నం ప్రత్యేక బస్సులు నడపాలని మంత్రి సూచించారు.
విద్యార్థులకు హాల్ టికెట్ లను ఆన్ లైన్ bse.telangana.gov.in లో ఉంచామని, విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు. హాల్ టికెట్ ఉన్న విద్యార్థులు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగు నీరు అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అన్నారు.
10వ తరగతి పరీక్షా కేంద్రాలకు ఎవరు సెల్ ఫోన్ తీసుకుని వెళ్లడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అధికంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహకం, మోటివేషన్ అందించాలని తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
గతంలో ఉన్న 11 పరీక్షలను ప్రస్తుతం 6 పరీక్షలకు కుదించామని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ మినహాయించి ప్రతి పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 జరుగుతాయని, ఫస్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ పరీక్షలు 9.30 నుంచి 12.50 వరకు మధ్యలో 20 నిమిషాల బ్రేక్ తో జరుగుతుందని,దీని పై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ లకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, డిఈఓ అబ్దుల్ హై, డిఎంఅండ్ హెచ్ ఓ సాంబశివరావు, డిపిఓ జగదీశ్వర్, కలెక్టరేట్ ఏఓ కిరణ్ ప్రకాష్,ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమకొండ R. బాబు నాయక్, తదితర పోలీసు, మునిసిపల్, వైద్య, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: