ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కార్మికులు ఆర్థిక అభివృద్ధి వారి సంక్షేమం కొరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కార్మికులను ఏకతాటిపైకి తీసుకుని వచ్చి ప్రతి సంవత్సరం మే నెల మొత్తం నిర్వహిస్తున్నా కార్మిక మాసోత్సావాలలో భాగంగా కార్మిక భవన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి విన్నవించడంతో . దయ హృదయంతో స్పందించిన కార్మిక పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అసెంబ్లీ సమావేశాలలో ప్రతి జిల్లాలో ఒక్క కార్మిక భవన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదించడంతో ఆదివారం అసెంబ్లీ ఆవరణలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కార్మిక సంఘ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
సీఎం కేసీఆర్ ని కలిసిన వారిలో కార్మిక నాయకులు జాతీయ ఉద్యోగ సంఘాల ఉపాధ్యక్షులు పుల్ల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు ఎంజాల మల్లేశం, హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎండీ సాదిక్ , ట్రై సిటీ అధ్యక్షులు భిక్షపతి, రఘపతి రెడ్డి , కొండయ్య, కృష్ణా ఉన్నారు


Post A Comment: