ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మహాశివరాత్రి పురస్కరించుకొని శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబ సమేతంగా హనుమకొండలోని వేయి స్తంభాల గుడి శ్రీ శ్రీ శ్రీ రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుని మహాభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ లోక కళ్యాణార్ధం మహా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలుపుతూ, శివుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని తెలుపుతూ అదేవిధంగా కెసిఆర్ పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరేజిల్లాలని మహా శివుడిని ప్రార్థించామని తెలిపారు.తదనంతరం ఆలయ అర్చకులు వేద వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు.
Post A Comment: