ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్కు వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ బీబీనగర్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కాజీపేట- సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Post A Comment: