మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్


మహాదేవపూర్:ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సోమవారం రోజు కాళేశ్వరం, కన్నెపెళ్లి, బీరసాగర్ గ్రామాలలో బిజెపి మంథని నియోజక వర్గం ముఖ్య నాయకులు సునీల్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ, అవినీతిలో కూరుకుపోయిన బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఈ ప్రాంత ప్రజలు పడుతున్న నష్ట కష్టాల ఇబ్బందులను ఇంటింటికి తిరుగుతూ తెలుసుకొని ఓదార్చి, ప్రచారం నిర్వహిస్తూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించి, రాష్ట్రంలో అవినీతి నియంత కుటుంబ పాలన కొనసాగిస్తున్న బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు దక్కకుండా చేయాలన్నారు. గ్రామలలో పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ బైక్ ర్యాలీలు కొనసాగించారు. కన్నె పల్లి గ్రామంలో సుమారు 50మందికి పైగా యువకులు ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై, సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ లో చేరారు. యాత్రలో భాగంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లోని కీలకమైన కన్నెపల్లి పంప్ హౌస్ నిర్మాణం కొరకు గ్రామంలోని రైతులు తమ విలువైన భూములను ఇచ్చారు. ఎకరానికి ఐదు లక్షలు  నష్టపరిహారం చెల్లించి తమ భూములను లాక్కొని ఈ ప్రభుత్వం విస్మరిస్తుందని, ఇక్కడ రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటారం మహాదేవపూర్, మలహర్, మహ ముత్తారం మండలాల్లోని సుమారు 40వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిన్న  కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు  నిర్మించకపోవడం శోచనీయమని  అన్నారు.తక్షణమే ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి, యాత్ర ప్రముఖ్ వెన్నం పెల్లి పాపయ్య, మంథని నియోజకవర్గ ప్రబరి కాటంగురి అనిల్ రెడ్డి, మండల అధ్యక్షుడు సిరిపురం శ్రీమన్నారాయణ, యాత్ర సహ ప్రముఖ్ దుర్గం తిరుపతి, మండల ఇంచార్జ్ ఉడుముల విజయ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, మల్కా మోహన్ రావు, పిలుమరి సంపత్, పార్లమెంట్ ఐటీ సెల్ కన్వీనర్ భీమారపు సంపత్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాగే రంజిత్,  మండల ప్రధాన కార్యదర్శిలు బొల్లం కిషన్,సూరం మహేష్, మంథని రాజేందర్,గంట అంకన్న, పూసల రాజేంద్రప్రసాద్, మేడిపల్లి పూర్ణచందర్,సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: