మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 23 వ డివిజన్ సుభాష్ నగర్ కు చెందిన ఠాగూర్ సునీత అనే యువతి అనారోగ్యంతో మృతి చెందిందని స్థానికులు తెలిపారు మరణించిన యువతీ నిరుపేద కుటుంబం అని మృతురాలి కుటుంబీకులకు పాడే సామాన్లు కొనడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడుతుండగా స్థానికులు సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ ను సంప్రదించగా మరణించిన ఠాగూర్ సునీత యొక్క అంతిమ యాత్ర కు సంబంధించిన పాడే సామాన్లను సుభాష్ నగర్ లోని వారి ఇంటి దగ్గర పంపించడం జరిగిందని స్థానికులు తెలిపారు నిరుపేద యువతీ కుటుంబ పరిస్థితి తెలుపగానే స్పందించి పాడే సామాన్లు పంపించిన సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు మరియు ఫౌండేషన్ సబ్యులకు మరణించిన ఠాగూర్ సునీత కుటుంబం తరఫున మరియు సుభాష్ నగర్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని స్థానికులు తెలిపారు ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ యూత్ నాయకులు చింత మణికంఠ సూరజ్ తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: