ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణ క్యాడర్కు కేటాయించిన 2021 బ్యాచ్కి చెందిన ఏడుగురు ప్రొఫెషనరీ ఐఏఎస్ లు బుధవారం హనుమకొండ మరియు వరంగల్ జిల్లాలోని భద్రకాళి టెంపుల్ వేయి స్తంభాల గుడి వరంగల్ కోర్టును సందర్శించడం జరిగింది. వీరు తెలంగాణ దర్శన్లో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ శిక్షణలో ఉన్న ఆ సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్ బెనహర్ మహేష్ దత్త ఎక్క ఐఏఎస్ ఆదేశాల మేరకు కోర్స్ డైరెక్టర్ శ్రీదేవి ఐలూరి పర్యవేక్షణలో ఫీల్డ్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ పెద్ద బోయిన ద్వారా సందర్శించడం జరిగింది. ముందుగా ఈ యువ ఐఏఎస్ లను హోటల్ హరిత కాకతీయ వద్ద జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి మరియు ఆర్డీవో వాసు చంద్ర రాజకుమార్ రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ కుమారస్వామీ, ఖీలా వరంగల్ తహసిల్దార్ ఫణి కుమార్, హరిత కాకతీయ హోటల్ మేనేజర్ అశోక్ రెడ్డి జిల్లా అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ తదితరులు స్వాగతం పలికారు తర్వాత వీరికి రాష్ట్ర పర్యాటక శాఖ తరపున అసిస్టెంట్ మేనేజర్ మార్కెటింగ్ జంజీరాల సాయిరాం హైదరాబాదు నుండి కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తూ వరంగల్లో వీరికి డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ కాకతీయుల చారిత్రాత్మకమైన ప్రగతిని వారు ప్రజలకు చేసిన సేవలు గురించి కాకతీయుల సామ్రాజ్య విశిష్టతను వివరించారు.

Post A Comment: