ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ఏ సమయంలోనైనా ప్రజలు, బాధితులు, సమస్యలపై ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని, చట్టపరిధిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  జె. సురేందర్ రెడ్డి  అన్నారు.  సోమవారం ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి  వచ్చిన 20 మంది బాధితులు, వారి సమస్యలను ఎస్పి  దృష్టికి తీసుకెళ్లగ, వారి సమస్యను అడిగి తెలుసుకుని,  పరిష్కారం కోసం  సంబంధిత పోలీస్ స్టేషన్ కు  బదలాయించి, తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. అనంతరం  ఎస్పీ  మాట్లాడుతూ, పోలీసు  అధికారులు,  మహిళా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. బాధితులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించుకోకుండా సకాలంలో న్యాయం చేయాలన్నారు. అలాగే సైబర్  నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన వాటిని యాప్ లను మాత్రమే సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: