చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఉప్పల్
నియోజకవర్గం నుండి ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్ళారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపే లక్ష్యంగా
పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీధర్, గండ్ర సత్యనారాయణ, బొరంపేట కృష్ణ
మరియు ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణో కలిసి పరమేశ్వర్ రెడ్డి ఎంపీఆర్ ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని వెంకంబావి తండా, రాచకొండ తండా,
కాడిలబావితండా, తుమబావి తండా, తదితర ప్రాంతాలలో బుధవారం
కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈకార్యక్రమంలో లింగంపల్లి రామకృష్ణ, ఢిల్లీ
చంద్రశేఖర్ రెడ్డి, జిత్తు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: