జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం ముందస్తుగా హిందీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు హిందీ భాషకు సంబంధించిన పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలు, నాటికలు, చిత్రలేఖన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ చల్ల సునీత రచించిన ‘దేవనాగరి లిపిలో వ్రాయబడిన భాషరా’ పాటను ఇంటర్మీడియట్ విద్యార్థినులు వర్షిణి, అర్చనలు ఆలపించారు. హిందీ భాష గొప్పతనం, ప్రాధాన్యతపై హిందీ ఉపాధ్యాయురాలు రాజమణి వివరించారు. కోట్లాది ప్రజల గుండెచప్పుడు హిందీ భాష అని ప్రిన్సిపాల్ చల్ల సునీత పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయ, సుజాత, రాజమణి, స్వప్న, సరిత, కవిత, మౌనిక, శ్రావ్య, లక్ష్మి, రిబ్కాతో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు.

Post A Comment: