భూపాలపల్లి, సెప్టెంబర్ 16: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా నియమితులైన పురుషోత్తం అనూప్ బుధవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవన్‌లో మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, ఎన్‌ఎస్‌యూఐ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. జిల్లా, మండల స్థాయిలో విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రతి కళాశాలలో ఎన్‌ఎస్‌యూఐను విస్తరించాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మంత్రి మార్గదర్శకత్వంలో జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐను మరింత బలోపేతం చేసి విద్యార్థుల హక్కుల సాధనకు కృషి చేస్తానని పురుషోత్తం అనూప్ తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: