గోరికొత్తపల్లి, జూలై 28: వ్యవసాయ పొలంలో నీటి మోటార్ వేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు మృతి చెందిన విషాద ఘటన భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం దామరంచపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కాడపాక సాగర్ వ్యవసాయ పనుల్లో భాగంగా పొలంలో మోటార్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే సాగర్ మృతి చెందినట్లు తెలిసింది. ఆయన ఆకస్మిక మృతితో దామరంచపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు సాగర్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: