తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు తెలంగాణ ప్రజా ఫ్రంట్ TPF సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది. 41 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ కనీసం స్పందించకుండా 41 రోజుల తర్వాత ఐఏఎస్ తో కమిటీ వేశామని కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించింది. గత ఎన్నికలలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను వంచనకు గురిచేసింది. ఈ స్థితిలో అనివార్యమైన పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులంతా తమ సమస్యల పరిష్కారానికి సమ్మెబాట పట్టింది. సమ్మెను పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలంతా ఆర్టీసీ కార్మిక వర్గానికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. కార్మికులంతా తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఐక్యంగా ఉండాలని, ఎన్ని ఒత్తిడిలు ఎంత నిర్బంధం ఎదురైనా చైతన్యంతో సమ్మెను కొనసాగించాలని కిరణ్ పిలుపునిచ్చారు.

Post A Comment: