జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం, అంబటిపల్లి గ్రామంలో  అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. సూరారంలోని ఎస్.ఎస్.వి. స్కూల్‌కు చెందిన బస్సు ఢీకొని మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సింగనేని మల్లేష్, భాగ్య దంపతుల కూతురైన ఈ చిన్నారి ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడింది.

ఈ ఘటనలో పాప మెదడు బయటికి వచ్చి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటనతో అంబటిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: