గోదావరిఖనిరూరల్,జూలై.15(విజన్ఆంధ్ర)లొంగిపోయిన మావోయిస్టులు నాలుగు దశాబ్దాలపాటు సిపిఐ మావోయిస్టులో పనిచేసి లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు నాయకులు ఆత్రం లచ్చన్న,ఎస్ సిఎం,చౌదరి ఆంకుభాయి,డీసీఎం లు లొంగిపోయారు.లచ్చన్నకు 20 లక్షల చెక్కు,అంకుబాయికి ఐదు లక్షల చెక్కును రామగుండం సిపి వారికి అందజేశారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడారు అజ్ఞాతంలో ఉన్న అదిలాబాద్,కరీంనగర్ జిల్లా మావోయిస్టులు కూడా వారి గ్రామాలకు తిరిగి రావాలని కోరుతున్నాం అని అన్నారు.జనజీవన స్రవంతిలోకి వచ్చేవారికి లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే రివార్డుతోపాటు పునరావాస పథకంకింద లభించే పథకాలు అందచేస్తాంఅని వీరి జీవనోపాధికై అందిస్తున్న చెక్కులే నిదర్శనం అని తెలిపారు.
ఈ సందర్భంగా మావోయిస్టు దంపతులు మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం,పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధరకాల సహాయ సహాకారాలు.లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని,తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని,రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఎదుట లొంగిపోతున్నట్టు తెలిపారు.మావోయిస్టు పార్టీ గాడి తప్పిందని నాయకత్వ విధానాలు సరిగా లేవని ఆరోగ్య కారణాలవల్ల జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టు తెలిపారు.ఆత్రం లచ్చన్న@ గోపన్న రాజప్ప తండ్రి భీమయ్య వయసు 60 సం.లు. గ్రామం పారాపేల్లి,కోటపల్లి మండలo.మంచిర్యాల జిల్లా.2007 సంవత్సరం నుండి నార్త్ బస్టర్ ఛత్తీస్గఢ్లో టెక్నీషియన్ గా లొంగిపోయేంతవరకు లచ్చన్న అక్కడే పనిచాడు.ఆత్రం లచ్చన్నపై తెలంగాణలోని వివిధ జిల్లాలలో 35 కేసులు నమోదుఅయ్యాయి.చౌదరి ఆంకుభాయి@అనితక్క@లక్ష్మి,భర్త ఆత్రం లచ్చన్న @గోపన్న,వయస్సు55సంవత్సరాలు,కులం.బిసి(ఆరే)ఆగరగుడా,బెజ్జూర్ మండలం,(కొమురంభీం అసిఫాబాద్ జిల్లా)అనితక్క 1988 వ సంవత్సరంలో తన అన్న చౌదరి చిన్నన్న ప్రోత్సాహంతో అప్పటి పీపుల్స్ వార్లో దళ సభ్యురాలిగా చేరి సిర్పూర్ దళంలో పనిచేస్తున్న తరుణంలో సిర్పూర్ దళం డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్న ఆత్రం లచ్చన్నని వివాహం చేసుకుంది.1995 వరకు సిర్పూర్ దళంలోనే పనిచేసి 1995 లో తన భర్త లచ్చన్నతో పాటు పట్టణ ప్రాంతానికి బదిలీ అయి 2002 సంవత్సరంలో ఏసీఎం గా పదోన్నతి పొంది డీకే ఎస్ జెడ్సిలోని టెక్నికల్ డిపార్ట్మెంట్ కి తన భర్తతో పాటుగా బదిలీ అయ్యింది.2007 సంవత్సరంలో నార్త్ బస్తర్ డివిసి టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ అయ్యింది.లొంగిపోయేంతవరకు నార్త్ బస్తర్ లోని టెక్నికల్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు.చౌదరి ఆంకుభాయిపై కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 14 కేసులు కేసులు ఉన్నాయని తెలిపారు.రామగుండం కమిషనరేటు పోలీసుశాఖ తరుపున,అజ్ఞాతములో ఉన్న మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రావాలిసినదిగా కోరుచున్నామని తెలిపారు.తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని,తెలంగాణ అభివృద్దికి తోడ్పడాలని కోరుతున్నాము.అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్లయితే,తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు మరియు ఇతర సహాయ సహకారాలు అందిస్తుంది.వారు స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం వారికి అన్నీవిధాల తోడ్పాటును అందిస్తుంది.లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందజేయడానికి రామగుండం కమిషనరేటు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అని హామీ ఇస్తున్నాం.ప్రజా సంఘాల ముసుగులో,దందాలు కొంతమంది వ్యక్తులు ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారు.అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుంది.వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.యువత మరియు ప్రజలు ఇటువంటి వారికి దూరంగా ఉండాలి.మావోయిస్టులకు నేటి యువత దూరం.ప్రస్తుత సమాజంలో యువత చైతన్యవంతంగా వ్యవహరిస్తున్నది.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వారు దూరంగా ఉంటున్నారు.మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిపోయింది.చదువుతున్న వారు ఎవరు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం లేదని.కాలం చెల్లిన సిద్ధాంతం మావోయిజం.నేటి ప్రపంచంలో మావోయిజం కాలం చెల్లిన సిద్ధాంతంగా మిగిలిపోయినది.హింసను ప్రేరేపించే సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారు.ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ మావోయిజం కనుమరుగైపోయింది తెలిపారు.ఈ మీడియా సమావేశంలో మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపీఎస్,అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు,జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి,చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్,కోటపల్లి ఎస్సై రాజేందర్,నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


Post A Comment: