పెద్దపల్లి.గోదావరిఖని:జూలై11.2024(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్):కలెక్టర్ ఆధ్వర్యంలో పల్లె దవాఖానల ఎన్ క్యూఏఎస్ జాతీయ నాణ్యత ప్రమాణంలో భాగంగా జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలలో సౌకర్యాలు సేవలపై కేంద్ర మినిస్టర్ ఆఫ్ హెల్త్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఆరోగ్యం నాణ్యతలు సేవలు సీజన్ వ్యాధుల గురించి ఎలా జరుగుతున్నాయి అని వర్చువల్గా మినిస్టరీ ఆఫ్ హెల్త్ సర్వీస్ నుండి,పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం,ముస్త్యాల గ్రామ పల్లె దవాఖాన ఆయుష్ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం సేవలు నాణ్యతపై ఆన్లైన్లో ఆరోగ్య మందిర సిబ్బందితో ఇంటరాక్ట్ కాన్ఫరెన్స్ నిర్వహించినారు.
ఇట్టి కార్యక్రమాన్ని పెద్దపెల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రసన్న కుమారి ప్రారంభించారు.ప్రజలకు వైద్య సేవలు గురించి ముందస్తు సీజన్ వ్యాధుల గురించి జాగ్రత్తలు తీసుకోవలసిన విధానాలను వివరించారు.ముందుగా పల్లె దవాఖాన ముందు కాలుష్యం ఆక్సిజన్ పకృతి పచ్చదనం అనే అంశంపై మొక్కలు నాటినారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్ కుమార్.సిహెచ్ఓ ది భరత్,మేనేజర్ అనిల్ కుమార్,వైభవ అసిస్టెంట్ క్వాలిటీ మేనేజర్ డాక్టర్ రూప ఎంఎల్ హెచ్ పి,పుష్పవతి,సుప్రవేజర్,మిట్ట శ్రీనివాస్ హెల్త్ అసిస్టెంట్,ఏఎన్ఎంలు శోభరాజ్ సరూప.ఆశ వర్కర్లు రాజేశ్వరి,లక్ష్మీ,నీల తదితరులు పాల్గొన్నారు...


Post A Comment: