BREAKING NEWS :
హన్మకొండ, న్యూస్టుడే:
మనిషికి గుండెపోట్లు ఎప్పుడు, ఎక్కడ ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు.వయసు తో సంబంధం లేకుండా ఈ మధ్యల గుండెపోట్లు వస్తున్నాయి. ఉన్నచోటనే ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఈరోజు హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ లో గీత కార్మికుడు కల్లు గీయడానికి చెట్టు పైకి ఎక్కినాడు.ఆ తాటిచెట్టుపైనే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. పరిమళ కాలనిలో బైరగోని యాదగిరి గౌడ్ తాటిచెట్టు ఎక్కి కళ్ళు గీస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. తాటిచెట్టు పై నుంచి కిందకు వేలాడుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెట్టు పైనే మృతి చెందిన యాదగిరిని కిందకు దించారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: