మావోయిస్టుల కదలికలపై పటిష్ట నిఘా ఉండాలని, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ అన్నారు. గురువారం ఎస్పి మహాదేవపూర్ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, కేసుల స్థితి గతులు అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, నమోదయ్యే కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీసీ కెమెరాల పనితీరు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకుని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ మహాదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి మహారాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నందున మావోయిస్టుల కదలికపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల భద్రతకై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బాధితులు ఫిర్యాదు చేయగానే విచారణ జరిపి, న్యాయం చేయాలన్నారు.

పోలీసులు క్రమశిక్షణగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని అన్నారు. ఆ తర్వాత అధికారులతో కలిసి పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పి , పిఎస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ జి. రామ్ మోహన్ రెడ్డి, సిఐ కె. రామచంద్రరావు, ఎస్సై కె.పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: