హన్మకొండ ;
హనుమకొండ కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరం నందు జాతీయ విద్యా దినోత్సవంలో మౌలానా అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి హ నుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ విద్యా దినోత్సవం కలెక్టరేట్లో జరుపుకుంటున్నాము అలాగే మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ లో కూడా జరుపుకుంటున్నాము. భారతరత్న పొందిన గొప్ప వ్యక్తి అని, ఈరోజు ఉన్న చాలా సంస్థలు ఐఐటి మరియు సిఎస్ఐఆర్ సంస్థలు అన్నీ కూడా ఆయన చేసిన కృషి ఫలితమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వై వి గణేష్ ,డియండబ్లూఓ మురళీధర్ రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: