పెద్దపల్లి,గోదావరిఖని,అక్టోబర్,18(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)రామగుండం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఇన్చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో సభ్యత్వం.రామగుండం నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వనమోదు ముందంజలో ఉన్నది.కుందనపల్లి,రామగుండం రైల్వే స్టేషన్,గోధావరిఖని లక్ష్మీ నగర్ చౌరస్తాలో పార్టీ సబ్యత్వనమోదు రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు,సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఊహించని స్పందన లభిస్తుందని,దీనితో రాబోయేఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం తధ్యంఅని అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని దేశీయత,ఆర్థిక స్వావలంబన,ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట వంటి అంశాల్లో మోదీ నాయకత్వం కీలకపాత్ర పోషిస్తోందని మోదీ పథకాలు దేశంలోని ప్రతి వ్యక్తికి మేలు చేస్తాయని,ప్రజలు పెద్దఎత్తున బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకొని మోదీ పథాలను సమర్థిస్తున్నారని,మోదీ స్ఫూర్తితో సభ్యత్వనమోదు విజయవంతమవుతోందని,ప్రజల్లో దేశఅభివృద్ధి పట్ల ఉత్సాహం పెరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.పార్టీలో సబ్యత్వం తికున్న వారికీ కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చిలువేరు కుమార్,శ్రీకాంత్,బబ్లు.జన్నంపల్లి కృష్ణారెడ్డి,రాపోలు రవిందర్ రావ్,మేకల రాజమల్లు,ఓరుగంటి శ్రీరాములు,బరిగల శ్రీనివాస్,బరిగెల రాజెంద్ర ప్రసాద్,బుక్యా రాంసింగ్,కలవేణి నర్సింగ్,మేకల కనకమ్మ,దోంతుల భూమయ్య,సిద్ద స్వామి,రవి,చింతక్రింది నాగరాజు పార్టీ నేతలు,కార్యకర్తలు,ప్రజలు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: