ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 ను పురస్కరించుకొని జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పర్యాటకం - శాంతి అనే అంశం పై జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యాటకం పై అవగాహన కల్పించడానికి పాఠశాల నుండి ఉన్నత విద్యా స్థాయిలో ఏకో టూరిజం క్లబ్ లను ఏర్పాటు చేశామని ,మరిన్ని విద్యా సంస్థలు రిజిస్ట్రేషన్ లు చేసుకుంటున్నాయని తెలిపారు.
నేడు హరితా కాకతీయలో....
ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు నక్కల గుట్ట లోని హరిత హోటల్ లో ఫుడ్ ఫెస్టివల్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి యం శివాజీ తెలిపారు. పర్యాటక రంగం పై అవగాహన కోసం గురువారం నాడు హెరిటేజ్ వాక్ వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యాటకం రంగంపై అవగాహన కోసం ఇప్పటికే జిల్లాలోని పలు పాఠశాలల్లో,కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నేడు హరిత హోటల్ లో జరిగే కార్యక్రమాలని విజయవంతం చెయ్యాలని తెలిపారు.
Post A Comment: