ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

నయీమ్ నగర్ నాలాతో పాటు నాలాపైన ఉండే వంతెనల అభివృద్ధి నిర్మాణ పనులను జూన్ 15వ తేదీ నాటికి పూర్తి చేసేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. 

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా లతో కలిసి నయీమ్ నగర్ నాలా నిర్మాణ పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై రెవెన్యూ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, సర్వే విభాగం,  ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు.

నాలా అభివృద్ధి పనుల పురోగతి, ఎప్పటి వరకు అభివృద్ధి పనులను పూర్తి చేస్తారనే వివరాలతో పాటు నిర్మాణ పనులలో ఎదురవుతున్న ఇబ్బందుల పై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ నాలా అభివృద్ధి పనులను

త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. నాలా అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికలు ముగిసినందున ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని వెంటనే పరిష్కరించి నాలుగైదు రోజుల్లో నిర్మాణ పనులను ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా పనులను పూర్తి చేయాలన్నారు. నాలా పనులకు సంబంధించి సర్వే పూర్తి చేయాలన్నారు. మూడు రోజుల్లో సర్వే పనులను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. సర్వే అనంతరం ఈ పనులపై మరోసారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 

 ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ రాజయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి వెంకన్న, ఇరిగేషన్ ఈ ఈ  ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: