పెద్దపెళ్లి:రామగిరి:మంథని,నవంబర్:24(మేడిగడ్డటీవీన్యూస్)సింగరేణి కార్మికుల పాదయాత్ర అభినందనీయం,ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలి మలి దశ ఉద్యమాల్లో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని,వారి ఉద్యమస్పూర్తి మరువలేనిదని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు.సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు పొందిన యువకులు హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టమధూకర్ గెలుపు కోసం సెంటనరీ కాలనీలోని కోదండరామాలయం నుంచి మంథనిలోని గౌతమేశ్వరస్వామి ఆలయం వరకు శుక్రవారం సింగరేణి కార్మికులు చేపట్టిన పాదయాత్రను పుట్ట శైలజ ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడరు.రాష్ట్రంలోనే మంథనినియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని,ఇక్కడ సిరులు పండించే సింగరేణి సంస్థ ఉందని.సింగరేణి బిడ్డలు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ నాయకత్వంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు.అనేక ఏండ్లుగా ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యమయ్యాయని, వారి భవిష్యత్కు బంగారు బాటలు వేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలిచి ఇక్కడి అభ్యర్థి పుట్ట మధూకర్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలనే మంచి ఆలోచనతో యువకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టమధూకర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే అవకాశం ఉంటుందని,ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ గెలుపు కోసం పని చేస్తామంటూ పాదయాత్ర చేపట్టి ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమని ఆమె అన్నారు.ప్రచారంలో భాగంగా అభ్యర్థి పుట్ట మధుకర్ పాదయాత్ర చేస్తున్న కార్మికులకు ఓసిపి టు కాడ కలుసుకొని అభినందనలు తెలిపారు.ఈ పాదయాత్ర కార్యక్రమంలో పార్టీ నాయకులు సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: