పెద్దపల్లి:రామగిరి:నవంబర్21:మేడిగడ్డటీవీన్యూస్)మంథని నియోజకవర్గం ముస్త్యాల గ్రామంలో కెసిఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గడపగడపకు అందజేసి కారుగుర్తుకు ఓటేసి పుట్ట మధుకర్ ను గెలిపించాలన్నర్,పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే మనకు కర్ణాటక గతే పడుతుందీ.గ్రహణం పట్టిన కాంగ్రెస్ కారుచీకటి పార్టీని మార్చేయాలని స్వాతంత్రం వచ్చిన వెంటనే ఆనాడే గాంధీజీ చెప్పినట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్ట రాజన్న అన్నారు.మంగళవారం రామగిరి మండలం ముస్తాల గ్రామంలో మంథని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వాంచారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.తెలంగాణ రాకుంట అడ్డుకున్న ఆంధ్ర కాంగ్రెస్ నాయకత్వానికి తెలంగాణ నాయకులు వెంకటస్వామి,శ్రీపాదరావ్ లాంటి వారి రాజకీయ కుటుంబాలు తెలంగాణ పేరు చెప్పుకొని దేశంలో,తెలంగాణలో ఎంత స్థాయిలో ఉన్నారో మేధావులు,ప్రజలు ఆలోచన చేయాలి,తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్న తరుణంలో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జతకట్టిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన అనుచరులు ఎంత అరాచకం సృష్టించాడో మంథని ప్రజలు మేధావులు మరిచిపోతీ రా,మతితప్పితిరా?.నాటి విద్యార్థి జేఏసీ నాయకుడు నేడు కోర్టు చుట్టు తిరుగుతున్న శ్రీరాముని అడిగి తెలుసుకోండి,కాంగ్రెస్కు ఓటు వేస్తే కారుచీకటే అని గుర్తుతెరగాలి,తొమ్మిదేళ్ల తెలంగాణ పచ్చని ప్రశాంత వాతావరణం పాలనలో కొనసాగుతుంటే విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు పూనుకున్నదని,ప్రజా సమస్యలు ఏనాడు పట్టించుకోకుండా హైదరాబాదుకు పరిమితమై అల్లుడు అత్తగారింటికి వచ్చినట్టు ఉన్నది మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగిరి ఇలాంటి వారికి ఓటుతో సరి అయిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు,మంథని నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకర్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలతో పాటు పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కళ్ళముందు కనిపిస్తున్న ప్రజల నాయకుడు పుట్ట మధుకర్ కారు గుర్తుకు ఓటువేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసినారు,మంగళవారం రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 12 పథకాల మేనిఫెస్టోను గ్రామంలో గడపగడపకు చేరవేస్తూ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసినారు,తెలంగాణ ఉద్యమ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పుట్ట రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బాసినేని సత్యనారాయణరావు,సుంకర మహేష్,కోసిక నరసయ్య,సుందిళ్ల రాజు,బాసినేనిమహేందర్ రావు,అవునురి సమ్మయ్య,బి,వినోద,ఎస్ మాధవి,రైతు రమేష్,ప్రశాంతు,రాజేశం,పిట్టల రవి,సుందిళ్ల రఘు,బేర పూర్ణచందర్,బి రవి,వెంకటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు,నాయకురాలు తదితరులు పాల్గొన్నారు,

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: