మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు పుష్పాలతో నమస్కారం చేయడం జరిగింది....ఆగస్ట్ 20న చలో ఇందిర పార్క్ -హైదరాబాద్ కు తరలి రావాలని..... తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు యొక్క పోస్టర్లను టి యు ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, టి యు ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో .... కలిసి ఆవిష్కరించిన ఉత్తర తెలంగాణ కన్వీనర్ , జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్...
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యమ రథసారథి , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.....
తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేశామని ఆగస్ట్ 20న జరిగే ఉద్యమకారుల సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రతి ఉద్యమకారుడు హాజరుకావాలని కోరారు...
ఆనాడు ఉమ్మడి రామగుండం మండలం లో తెలంగాణ రాష్ట్రం కోసం బస్, లారీలు, కాలబెట్టడం ,ఐవోసి పైన దాడి చేశాం .... మా మీద నాన్- బెలబుల్ కేసులు పెట్టడం జరిగింది...రామగుండం పట్టణం లో మరియు గోదావరిఖని చౌరస్తా గడ్డ మీద ఎన్నో ఉద్యమాలు చేశామని తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నీలిచామని మళ్లీ నేడు రాష్ట్రం కోసం కష్టపడ్డ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి... ఉద్యమానికి నాంది పలుకుతున్నామని తెలిపారు...
తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డ ప్రతి ఉద్యమకారుడు ఏ పార్టీలో ఉన్న తగిన ప్రాధాన్యత , గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు...
రానున్న రోజుల్లో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఉద్యమకారుల సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని ఉద్యమకారులు డిమాండ్ చేశారు....
ఈ కార్యక్రమంలో టి యు ఎఫ్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి, ఉద్యమ కారులు నూనె రాజేశం, తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు....గొర్రె రమేష్ ,నూనె కొమురయ్య , అక్కపాక లక్ష్మి, టి యు ఎఫ్ అంతర్గాం మండల ఉద్యమ కారులు అంగోత్ శంకర్, గోసిక తిరుపతి, అలకుంట సంపత్, వేముల రాజ్ కుమార్, బానోతు సురేష్, మామిడి రవీందర్, తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: