మహాదేవపూర్ మండల ప్రతినిధి దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండలంలోని కాళేశ్వరం అంతరాష్ట్ర బ్రిడ్జి సమీపంలో బైకును లారీ ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై ఇద్దరు యువకులు వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో పిట్టల శేఖర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ యువకుడిని హుటాహుటిన మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం కు రెఫర్ చేశారు..
Post A Comment: