మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
భూపాలపల్లి: అంబేద్కర్ సెంటర్ ప్రధాన కూడలి జాతీయ రహదారి మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. వాహనదారులు ప్రయాణం చేయడం చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అలాగే బాంబుల గడ్డ నుండి ఫైంట్ లైన్ కమాన్ వరకు, ఒకవైపు రహదారి మొత్తం గాఢాలు కాలువగా ఉండడం వలన మోటార్ సైకిల్, కారు లాంటి వాహనాలు అదుపుతప్పి పడి అంగవైకల్యానికి లేదా ప్రాణా ప్రాయ పరిస్థితులు జరిగే అవకాశాలు ఉన్నాయి.కావున ఆర్&బి వారు వెంటనే ఈ ఒక్క రోడ్డు మరమ్మత్తులు త్వరగా చేయాలని, ఇప్పుడు వర్షాకాలం కావున గుంతలలో నీళ్లు నిండడం వల్ల వాహనదారులు పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, వెంటనే మరమ్మత్తులు ప్రారంభించాలని తీన్మార్ మల్లన్న 7200 టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు.అలాగే ప్రధాన కూడలిలో సిగ్నల్ లైటింగ్ సిస్టం పనిచేయకపోవడం వలన వాహనదారులు ఇష్టానుసారంగా వెళ్లడం వలన ఇతరులకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది, కావున సిగ్నల్ లైటింగ్ రిపేర్ లేకుండా వెంటనే పునరుద్ధరించాలని రవి పటేల్ కోరారు.ఇందులో జిల్లా కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.
Post A Comment: