మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో ఐఎఫ్టియు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం బొగ్గు గనుల మీద ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నది. ఆషాడ మాసంలో బొగ్గు గని కార్మికులంతా గత 130 సంవత్సరాలుగా కార్మికులంతా డిపార్ట్మెంట్ వారిగా సామూహిక భోజనాలు వండుకొని దావతులు చేసుకోవడం సాంప్రదాయంగా వస్తున్నది. కానీ సింగరేణి యాజమాన్యం ఈ సంవత్సరం బావుల మీద వంటలు వండవద్దని దావతులు చేసుకోవద్దని ప్రత్యేకంగా సర్కులర్ను జారీ చేయడం దానికి కోడ్ ఆఫ్ డిసిప్లేన్ అడ్డం పెట్టుకోవడం దుర్మార్గం. వెంటనే సింగరేణి యాజమాన్యం కార్మికులను అవమానపరిచే విధంగా విడుదల చేసిన సర్కులర్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కోడ్ ఆఫ్ డిసిప్లేన్ పేరుతో సింగరేణి యాజమాన్యం కార్మికులపై అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నది. మేము మొదటి నుంచి చెప్తున్నాం. వేరి లో కోడ్ ఆఫ్ డిసిప్లేన్ నిరంకుశంగా ఉన్నద దాన్ని రద్దు చేయాలని చెబుతున్నాం. దానిని మార్చకుండా సింగరేణి యాజమాన్యం దాని పేరుతో కార్మికులపై, కార్మిక సంఘాలపై పెత్తనం చెలాయించేందుకు కుట్రలు చేస్తున్నది. వెంటనే సింగరేణి యాజమాన్యం కార్మికుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోకముందే తక్షణమే యాజమాన్యం జారీ చేసిన నిరంకుశ సర్కిలర్ ను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. *ఇంకా ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నాయకులు పి రాజేందర్, ఏ సారయ్య, నగునూరు పోషం, ఎం వాసుదేవరెడ్డి, మాట్ల సమ్మయ్య, కొయ్యడ శంకర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: