మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కాటారం మండలం ఒడిపలవంచ గ్రామస్తులు సుమారు 100 మంది ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ అన్న సమక్షంలో పార్టీ లో చేరారు వీరికి సునిల్ అన్న కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ.....
ప్రధాని మోదీ ప్రభుత్వం పేద, బడుగుల అభ్యున్నతి కోసం పనిచేస్తుంది..గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రం నిధులు తోనే. గ్రామాలలో ఇంకుడు గుంతలు, రోడ్ లు, గ్రామ పంచాయతీ భవనాలు, హరితహారం, స్మశాన వాటికలు, ఎల్ యి డి లైట్స్ కేంద్రం ప్రభుత్వం ఇస్తుంది..
ప్రధాని ఆవాస్ యోజన పథకం మన రాష్ట్రలో వేస్తే ఇల్లు లేని ప్రతి పేదవానికి 3 లక్షలు వచ్చేవి కాని కెసిఆర్ అవి రాకుండా అడ్డుకున్నరు..
రానున్న రోజుల్లో బీజేపీ రాష్ట్ర లో అధికారం లోకి వస్తుంది..దళిత బంధు పేరుచెప్పి అందరిని మోసం చేస్తుండు అధికార పార్టీ కి చెందిన వారికి మాత్రమే ఇస్తున్నారు..
ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, మహిళ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడుముల విజయ రెడ్డి, జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి గంట అంకయ్య, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి సకినారం శ్రీ హరి,మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు నడిగొట్ట శ్రీవాణి, ఓబీసీ మండల అధ్యక్షులు జిల్లెల్ల శ్రీ శైలం, నాయకులు వేముల లింగయ్య ఉడుముల వెంకట్ రెడ్డి, దోమల సమ్మయ్య, వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: